వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వటంపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగా ఇప్పుడు టికెట్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కొండా మురళికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని మండిపయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక కళ్లు నెత్తికెక్కాయా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.



