ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 18 మండలాలకు తాగునీరు అందించేందుకు జల్ జీవన్, అమరజీవి జలధార కింద రూ. 2,370 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. ఈ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్.. వారాలు, నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ.. చిత్తూరువాసులకు తీరనున్న తాగునీటి కష్టాలు!
RELATED ARTICLES


