SBI Jobs: ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 250 కొత్త బ్రాంచులను ఏర్పాటు చేయనున్నట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఇందులో భాగంగా 12000 మందిని కొత్తగా నియమించుకుంటామని వెల్లడించారు. బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడాలని చూస్తున్న నిరుద్యోగులకు ఇది అదిరే శుభవార్తగా చెప్పవచ్చు. మరి బ్యాంక్ ఛైర్మన్ సీఎస్ శెట్టి చెప్పిన వివరాలు తెలుసుకుందాం.


