పోలవరం ఎడమ కాలువ నీటి విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు తీరుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. మొన్న వెలిగొండ, నేడు పోలవరం.. ఇలా చేయని పనులకు కూడా చంద్రబాబు క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారని జగన్ విమర్శించారు. ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి గోదావరి నీళ్లను పోలవరం ఎడమ కాలువలోకి లిఫ్ట్ చేసి.. పోలవరం నీళ్లు తెచ్చేశామంటూ ప్రచారం చేసుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. పోలవరం నిర్దేశిత ఎత్తులో పూర్తిచేస్తే లిఫ్టులతో పనిలేకుండా గ్రావిటీ ద్వారానే ఉత్తరాంధ్రకు నీటిని ఇవ్వవచ్చని సూచించారు.
“చంద్రబాబూ గారూ.. ఇదేం మ్యాజిక్?”: వైఎస్ జగన్
RELATED ARTICLES


