తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో మరింత వాడీవేడీగా సాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్.. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది.


