ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా ఇంగ్లాండ్ పురుషుల పరిమిత ఓవర్ల (వైట్ బాల్) జట్లకు స్పెషలిస్ట్ మెంటార్గా మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ను నియమించింది. హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్లో కేపీ చేరనున్నాడు. రాబోయే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనల నుంచే పీటర్సన్ ఇంగ్లాండ్ మెంటార్గా తన బాధ్యతలను ప్రారంభించనున్నాడు.


