కొండా సురేఖ బర్తరఫ్పై బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. గతంలో తామిద్దరం మంత్రులుగా కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే కొండా సురేఖను తొలగించడానికి కారణమని ఆరోపించారు. బీసీ మహిళను తొలగించడం ద్వారా కాంగ్రెస్కు బీసీలపై ఉన్న గౌరవం బయటపడిందని విమర్శించారు.


