జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాన్వాయ్ను విద్యార్థులు అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో కోమటిరెడ్డి విద్యార్థులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈసెట్ (ECET) పరీక్షను రద్దు చేయబోమని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రతి నెలా రూ. 2,000 స్టైపెండ్ అందిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. అలాగే మహబూబాబాద్లో విద్యార్థులపై దౌర్జన్యంగా వ్యవహరించిన టౌన్ సీఐ రఘుపతిరెడ్డిని విధులకు దూరం చేస్తూ ఎస్పీ శబరిష్ చర్యలు తీసుకున్నారు.


