తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్లో విలేకరులతో మాట్లాడిన ఆయన, సుస్మిత కామెంట్స్పై మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. సురేఖ మంత్రి పదవిలో ఉన్నందున వివరణ కోరామని, సమాధానం వచ్చాక క్రమశిక్షణా చర్యలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక విధానం ఉందని, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరియు CWC మాత్రమే టికెట్లను ఖరారు చేస్తాయని, ఇతరులు ఎవరు టికెట్లు ప్రకటించినా అవి చెల్లవని తేల్చి చెప్పారు.


