HomeTELANGANAగణేష్ మండపాలన్నింటికీ ఉచిత కరెంట్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన

గణేష్ మండపాలన్నింటికీ ఉచిత కరెంట్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ మండలాపలకు ఫ్రీ కరెంట్ అందించనున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మండపాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను కార్పొరేషన్ భరిస్తుందని అన్నారు. నగరంలో ప్రతి ఏడాది 2 వేల మండపాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. గత మూడేళ్లుగా విద్యుత్ ఛార్జీలను తానే వ్యక్తిగతంగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.22 వేల కోట్ల నిదులు తీసుకొచ్చామని.. 100 రోజుల్లో రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులు సాధించినట్లు చెప్పుకొచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments