రాజమండ్రిలోని రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి మీద నుంచి గోదావరిలో దూకి పిఠాపురం పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాధిక్ను పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. చిన్న క్లూ ఆధారంగా ఐదు రోజుల్లో నాలుగు రాష్ట్రాలు మారిన అతన్ని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక్క రోజు ఆగి ఉంటే కేరళ నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు వెళ్లేవాడని పోలీసులు చెబుతున్నారు.
5 రోజుల్లో 4 రాష్ట్రాలు.. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు సాధిక్ అరెస్ట్
RELATED ARTICLES


