Vijayawada Police Eagle Challenge: గంజాయిపై ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ‘ఈగల్ ఛాలెంజ్’ ప్రకటించారు. గంజాయి రవాణా, అమ్మకంపై సమాచారం అందిస్తే వారికి రూ.5వేలు బహుమతి ఇస్తారు. గంజాయి తాగిన వారిని పట్టిస్తే.. వారికి రూ.1,500 నగదు బహుమతి ఇస్తారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని.. ఎలాంటి భయం లేకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు విజయవాడ సీపీ రాజశేఖరబాబు. కచ్చితమైన సమాచారం అందిస్తే నగదు బహుమతి ఇస్తారు.
ఏపీలో ‘ఈగల్ ఛాలెంజ్’.. గంజాయిని పట్టిస్తే రూ.5వేలు, తాగేవారిని పట్టిస్తే రూ.1,500 ఇస్తారు
RELATED ARTICLES


