తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. భూ సమస్యలను పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. 22ఏకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన కేసులను వేగంగా పరిష్కరిస్తున్నామని.. కొన్ని కేసులు 24 గంటల్లోనే క్లియర్ చేస్తున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్కు భారీ స్పందన వచ్చినట్లు వెల్లడించారు.


