తెలంగాణలో విమానయాన రంగం అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైన సీఎం.. ఆదిలాబాద్, వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు పనులను వేగవంతం చేయాలని కోరారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్టులో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, MRO సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. మరోవైపు హుస్సేన్సాగర్లో సీప్లేన్ ల్యాండింగ్ సాధ్యాసాధ్యాలపై నివేదికను 2 వారాల్లో అందజేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.


