తెలంగాణ ఎంపీలకు కేటాయించిన ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగం జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగా ఉంది. రాష్ట్రంలోని 23 మంది ఎంపీలకు రూ.394 కోట్లు కేటాయించగా.. సుమారు రూ.94 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు డేటా పేర్కొంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 56 శాతం వినియోగంతో ముందున్నారు. ఆరుగురు ఎంపీలు 10 శాతంలోపే ఖర్చు చేశారు. అయితే పనులకు సిఫారసులు చేసినా జిల్లా యంత్రాంగం అనుమతులు, పనుల అమలులో జాప్యం వల్లే తక్కువ వినియోగం నమోదవుతోందని ఎంపీల కార్యాలయాలు చెబుతున్నాయి.


