TTD Used Daily 8 Tonnes Vegetables For Anna Prasadam: తిరుమల శ్రీవారి భక్తుల అన్నప్రసాదాలలో కూరగాయల దాతల సేవలు చాలా కీలకమైనవి.ఎన్నో ఏళ్లుగా దాతలు టీటీడీకి కూరగాయాలు అందిస్తున్నారు.. వారితో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. కూరగాయల దాతలతో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకకు చెందిన దాతలు కూరగాయల్ని టీటీడీకి అందిస్తున్నారు. దాదాపు 30 మంది దాతలు 33 రకాల కూరగాయలను సమకూరుస్తున్నారు.తిరుమలలో అన్నప్రసాదానికి రోజువారీ ఎన్ని టన్నుల కూరగాయలు, బియ్యం అవసరమవుతాయో టీటీడీ అడిషనల్ ఈవో తెలిపారు.
తిరుమలలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం.. రోజుకు ఎన్ని టన్నుల బియ్యం, కూరగాయలు కావాలో తెలుసా?
RELATED ARTICLES



