HomeTELANGANAతనపై నిఘా పెట్టారంటూ ఎంపీ అర్వింద్ ఆరోపణలు.. స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్

తనపై నిఘా పెట్టారంటూ ఎంపీ అర్వింద్ ఆరోపణలు.. స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్

తనపై నిఘా పెట్టారంటూ ఎంపీ అర్వింద్ ఆరోపణలు.. స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్

నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తనపై పోలీసులు నిఘా పెట్టారని చేసిన ఆరోపణలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకు ఏసీపీ స్థాయి అధికారి తనను అనుసరిస్తున్నారని అర్వింద్‌ ఆరోపించారు. పోలీసులు రాజ్యాంగం, చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ.. ఎంపీపై నిఘా పెట్టేందుకు ఏ అధికారినీ నియమించలేదని, ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. అర్వింద్‌ వద్ద ఆధారాలు ఉంటే నేరుగా అందించాలని వాటిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments