HomeNation and Worldవిమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్.. పైలెట్లు ఏం చేశారంటే?

విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్.. పైలెట్లు ఏం చేశారంటే?

గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్యూర్ కావడం తీవ్ర కలకలం సృష్టించింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించి విమానాన్ని యూటర్న్ తీసుకుని వెనక్కి మళ్లించారు. గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించగా.. పైలట్లు 220 మంది ప్రయాణికులతో విమానాన్ని అత్యవసరంగా సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments