వర్షాకాలం వచ్చిందంటే మొక్కలు నాటేందుకు ప్రకృతి కూడా అనుకూలంగా మారుతుంది. నేలలో తేమ ఉండటం, వాతావరణం చల్లగా ఉండటంతో కొత్తగా నాటిన మొక్కలు వేళ్లు విస్తరించుకోవడానికి, నాటిన మొక్కలు 100 శాతం పెరగడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో ఇంటి తోటలో కొన్ని పవిత్రమైన, పూజలకు ఉపయోగపడే మొక్కలను నాటుకుంటే ఏడాది పొడవునా వాటి పూలు, ఆకులను ఉపయోగించుకోవచ్చు.
ముఖ్యంగా రాబోయేవి అన్నీ పండగులే.. శ్రావణ మాసం, వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి, కార్తీక మాసం వంటి పండుగలు వరుసగా రాబోతున్న వేళ ఇంట్లోనే పూజకు అవసరమైన పూలు, ఆకులు అందుబాటులో ఉండటం సౌకర్యంగా ఉంటుంది. మరి ఈ వర్షాకాలంలో ఇంట్లో సులభంగా పెంచుకోగల పవిత్రమైన మొక్కలు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం..


