తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో రాజీనామా లేదా బర్తరఫ్పై చర్చ జరుగుతోంది. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన సురేఖ తన వివరణను అందించారు. మరోవైపు మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ సభ్యత్వానికి కూడా సురేఖ రాజీనామా చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అనుచరులతో సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో కొండా దంపతులు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.


