మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రజల తరఫున నిలబడి, వారి గొంతుకను అటు అసెంబ్లీతో పాటు ఇటు పార్లమెంట్లోనూ గట్టిగా వినిపించడమే తన ప్రధాన ధ్యేయమని తెలిపారు. రాష్ట్రంలో వర్షాభావం, ఎల్నినో ప్రభావం లేకుండా రైతాంగం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. విజయవాడ వేదికగా నిర్వహించే మీడియా సమావేశంలో ఈ నెలలోనే భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, పార్టీ కార్యాచరణను పూర్తి వివరాలతో వెల్లడిస్తానని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.


