నర్సింగ్ కాలేజీలో ఒక ఫోన్ కనిపించకపోవడం పెద్ద వివాదానికి దారి తీసింది. హాస్టల్లో తెలుగు ప్రాంత విద్యార్థినులు, ఈశాన్య రాష్ట్ర విద్యార్థినుల మధ్య గొడవ జరగడం.. దానిపై మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి స్పందించడం జరిగాయి. వెంటనే అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం హుటాహుటిన కలెక్టర్, ఎస్పీని సంఘటనా స్థలానికి పంపించి సమస్యను సద్దుమణిగేలా చేసింది. కలెక్టర్ ఆదివారం ఉదయం కూడా హాస్టల్కి వెళ్లి ఈశాన్య రాష్ట్ర విద్యార్థినులతో మాట్లాడి.. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
కాకినాడ నర్సింగ్ కాలేజీలో గందరగోళం.. విద్యార్థిని ఫోన్ మిస్సింగ్, మణిపూర్ మాజీ సీఎం ట్వీట్.. పరిగెత్తుకుంటూ వెళ్లిన అధికారులు
RELATED ARTICLES


