Nara Lokesh On New Pensions In AP: ఏపీ మంత్రి నారా లోకేష్ కొత్త పింఛన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అక్టోబరు నుంచి అర్హులందరికీ దశలవారీగా కొత్త పింఛన్లు ఇద్దామన్నారు. పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళదామన్నారు. మంత్రి లోకేష్ కేబినెట్ భేటీకి ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో సమావేశమయ్యారు. కొత్త పింఛన్ల అంశంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో నారా లోకేష్ చర్చించారు.
ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
RELATED ARTICLES


