పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఇక్బాల్ వింత వ్యాధి గురించి ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నీటి నుంచి బయటకు వస్తే శరీరం మండిపోతుండటంతో ఏళ్లుగా చెరువు నీటిలోనే ఈ బాలుడు కాలం గడుపుతున్నాడు. ఈ దయనీయ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్పందించారు. బాలుడిని ప్రత్యేకంగా ఎయిర్లిఫ్ట్ చేయించి ముంబైలోని సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం నిపుణులైన డాక్టర్ల బృందం బాలుడికి ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించి చికిత్స అందిస్తుంది.


