ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ఉద్దేశించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లోనూ చేపట్టాలని నిర్ణయించింది. కేవలం సోమవారం మాత్రమే కాకుండా.. అన్ని పనిదినాలలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పీజీఆర్ఎస్ కార్యక్రమం చేపట్టి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రతిరోజూ పీజీఆర్ఎస్.. సోమవారం వరకూ ఆగాల్సిన అక్కర్లేదు..
RELATED ARTICLES


