ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతోనే తన కుమార్తె వివాహం ఘనంగా జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి దంపతులు శ్రీ వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల రూపంలో స్వయంగా వచ్చి తన కూతురి పెళ్లి జరిపించారని, వారి రుణం తీర్చుకోలేనని అన్నారు.


