నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో హత్యకు గురైన ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి కేసును పోలీసులు చేధించారు. స్కూల్లో చదివే ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దోపిడీ కోసం హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. హత్యకు ముందు ఆమె ఫోన్లో చివరిగా పలికిన బాబు అనే మాట కీలక క్లూగా మారింది. సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్, ఫింగర్ప్రింట్స్, సాంకేతిక ఆధారాలతో పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. కాగా, హత్యకు ముందే విద్యార్థులు రెక్కీ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది.


