ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సీ కాలనీ నుంచి దెందుకూరు వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఉన్న డొంక రహదారి ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి వాణిజ్య భవనాలు, వెంచర్లు నిర్మిస్తున్నారని ఈ డొంక భూమి విలువ రూ.400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారులు సర్వే చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


