తెలంగాణలో నిషేధిత భూముల వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హరీశ్ రావు.. రాహుల్ గాంధీకి లేఖ రాయడం, మంత్రి పొంగులేటిని భర్తరఫ్ చేయాలని పేర్కొనడం, రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని చేసిన సంచలన ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం, ధరణి దగ్గరి నుంచి మెడికల్ కాలేజీల వరకు దోచుకున్నారని.. 10 ఏళ్లలో హరీష్ రావు ఎంత సంపాదించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.


