పర్యావరణ అనుకూల భవనాల నిర్మాణంలో భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సహా పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు.


