కిర్గిజిస్థాన్లో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ 26 వ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా, రష్యా అధ్యక్షులు సహా ప్రపంచ దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్కు చురకలు అంటించారు. ద్వంద్వ వైఖరి వీడాలని పిలుపునిచ్చిన ఆయన.. దాని వ్యవస్థను సమూలంగా కూల్చివేయాలని సూచించారు. పాక్ ప్రధాని ఎదురుగానే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్ విజన్ను కూడా ప్రకటించారు.
‘ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు’ ఎస్సిఓ సదస్సులో పాక్ ప్రధానికి మోదీ చురకలు
RELATED ARTICLES


