Fact Check PMMY: సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు ఎలాంటి తనఖా లేకుండా కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన ద్వారా రుణాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రూ.3250 కడితే చాలు మీకు రూ.20 లక్షల లోన్ తక్షణమే బ్యాంక్ ఖాతాలో పడిపోతుందని చాలా మందికి ముద్రా యోజన లెటర్లు వస్తున్నాయి. ఇలా మీకు కూడా వచ్చిందా? అయితే అలర్ట్. అది సైబర్ మోసగాళ్ల పనిగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


