గతేడాది జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలగొన్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అయితే, దీనికి ముందే పాకిస్థాన్తో ఉన్న సింధూ నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో భారత్ నుంచి దిగువకు ప్రవాహాలు నిలిచిపోగా.. పాక్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఒప్పందం నిలివేత ఏకపక్షమని గగ్గోలు పెడుతోన్న దాయాది.. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది.
సింధు నది జలాల ఒప్పందంపై హేగ్ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పు.. మీ పెత్తనం ఏంటి? అంటూ తిరస్కరించిన భారత్
RELATED ARTICLES


