HomeAndhra Pradeshమాజీ మంత్రి అంబటి రాంబాబుకు జగన్ పరామర్శ

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జగన్ పరామర్శ

హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో గుండె స్టెంట్ వేయించుకున్న అంబటి రాంబాబును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులు, ఆపరేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అపోలోలో జరిగిన ట్రీట్మెంట్ గురించి కూడా అంబటి రాంబాబు జగన్‌కు వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అంబటి రాంబాబు వివరించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అంబటి రాంబాబు.. డిశ్చార్చ్ తర్వాత సత్తెనపల్లి రానున్నారు. ఆ తర్వాత అభిమానులు, పార్టీ శ్రేణులను కలిసే అవకాశం ఉంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments