ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. స్టైపండ్ పెంపు గురించి 9 వేల మంది జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తుంటే సీఎం చంద్రబాబుకు పట్టడం లేదా అని ప్రశ్నించారు. జూనియర్ డాక్టర్ల నిరసనల కారణంగా అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని.. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దని సూచించారు. జూనియర్ డాక్టర్లను చర్చలకు పిలిచి వారి న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని జగన్ సూచించారు.
బాబుగారూ.. అహంకారం వీడండి..పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు: వైఎస్ జగన్
RELATED ARTICLES


