గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 193 పరుగులకు ఆలౌట్ అయినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి లంక ముందు 372 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం ఛేజింగ్లో భారత బౌలర్లు మానవ్ సుతార్ (2/30), సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ విజృంభించడంతో లంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 84 పరుగులు చేసి తీవ్ర ఒత్తిడిలో పడింది.


