HomeVideosవిశాఖ: యూకేజీ విద్యార్థి మృతి.. టీచర్ కొట్టడమే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ..

విశాఖ: యూకేజీ విద్యార్థి మృతి.. టీచర్ కొట్టడమే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ..

విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లిటిన్ గార్డెన్స్ స్కూలులో యూకేజీ చదువుతున్న ఆరేళ్ల ప్రణయ్ తేజ మృతి చెందాడు. గురువారం రోజు స్కూలుకు వచ్చిన ప్రణయ్ తేజను.. హోం వర్క్ చేయలేదని టీచర్ మందలించారు. ఈ క్రమంలోనే అతని చెంపపై కొట్టారు. ఆ వెంటనే విద్యార్థి కుప్పకూలగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రణయ్ తేజ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు టీచర్ కొట్టడం వలనే తమ కుమారుడు చనిపోయాడని ప్రణయ్ తేజ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments