తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం పింఛన్ల దరఖాస్తు గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకూ పొడిగించింది. ఈ గడువు ఆగస్ట్ 31తో ముగియగా.. దరఖాస్తు చేసుకోనివారి అభ్యర్థనతో గడువు మరో పదిహేను రోజులు పొడిగించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షల మందికి కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా.. ఆదివారం (మే 30) నాటికే దరఖాస్తుల సంఖ్య 4.34 లక్షలకు చేరడం గమనార్హం. ఇప్పుడు గడువు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగనుంది.


