తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై కీలక ప్రతిపాదనలు చేశారు. అమరావతి-బెంగళూరు-చెన్నై నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు కారిడార్, దక్షిణాది విద్యుత్ గ్రిడ్, గోదావరి-కావేరి నదుల అనుసంధానం, తిరుపతి నుంచి చార్ధామ్ వరకు ఆధ్యాత్మిక సర్క్యూట్ వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. విభజన హామీలు, అమరావతి, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరారు.


