రాజకీయ విమర్శలు చేస్తే కేసులు పెట్టడం ఏంటంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను ప్రశ్నించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, రాజకీయ విమర్శలు చేస్తూనే ఉంటానని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు సీఐడీతో పాటు మరో కేసు నమోదు చేశారని అంబటి రాంబాబు అన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన వేషధారణ గురించి కృష్ణ సినిమాల్లోనే విమర్శించిన విషయాన్ని అంబటి రాంబాబు గుర్తు చేశారు.
ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు: అంబటి రాంబాబు
RELATED ARTICLES


