హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రాయదుర్గం మరోసారి సంచలనం సృష్టించింది. టీజీఐఐసీ నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం రూ.264 కోట్ల రికార్డు ధర పలికింది. పాన్మక్తాలోని 5.25 ఎకరాల భూమిని ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకుంది. ఈ భూమికి కనీస ధరను ఎకరాకు రూ.175 కోట్లుగా నిర్ణయించగా.. బిడ్డింగ్లో భారీ పోటీ నెలకొంది. ఇదే ప్రాంతంలో మేలో ఎకరం రూ.237 కోట్ల ధర నమోదైంది.


